బాలయ్య విషయంలో క్లారిటీ ఇచ్చిన నాగార్జున

  • April 10, 2017 / 07:17 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య గొడవలు ఉన్నాయంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో హడావుడి ఎక్కువైంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున, బాలకృష్ణ మధ్య మాటలు లేవని ప్రచారం సాగింది. ఇది నాగ్ ని చాలా బాధకు గురిచేసింది. ఈ విషయంపై ఆయన స్పందించారు. రెండు రోజుల క్రితం వైజాక్ లో  టిఎస్సార్ – టీవీ  9 అవార్డుల ప్రదానోత్సవం  వైభవంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. లక్షల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ వేదిక సరైనదని భావించిన నాగ్ గొడవ గురించి మాట్లాడారు.

‘ఇంతంది అభిమానుల సమక్షంలో ఒక విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. కొన్ని రోజులుగా నాకు, బాలయ్యకు గొడవలున్నాయని, మేమిద్దరం మాట్లాడుకోవడంలేదని వార్తలొస్తున్నాయి. అవన్నీ వట్టి పుకార్లు. మాకు ఎలాంటి గొడవలు లేవు’ అని స్పష్టం చేశారు. నాగ్ మాట్లాడుతుండగానే పక్కనే వేదికపై నున్న బాలకృష్ణ వెంటనే నాగార్జునను ఆత్మీయ  ఆలింగనము చేసుకున్నారు. ఇలా రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో బాలకృష్ణ, నాగార్జున అభిమానులు సంతోషించారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus