మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న నాని, నాగార్జునల సినిమా.!

  • March 28, 2018 / 07:52 AM IST

“భలే మంచిరోజు”, “శమంతకమణి” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య …నాని, నాగార్జునను కలిపి ఓ మల్టీ స్టారర్ (Nagarjuna Nani MultiStarrer) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉగాది రోజున మొదలయింది. హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్లో నాని, రష్మిక మందన్న, సంపూర్ణేష్ బాబుల మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ షెడ్యూల్ నిన్నటితో కంప్లీట్ అయింది. చాలా సరదాగా షూటింగ్ సాగినట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇందులో నాని డాక్టర్ గా కనిపించనుండగా.. నాగార్జున డాన్ పాత్రను పోషించనున్నారు. అయితే వీరి మధ్య ఉండే సీన్లు చాలా ఫన్నీగా ఉంటాయని తెలిసింది. రెండో షెడ్యూల్లో నాగ్, నాని కాంబినేషన్ సీన్స్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సరికొత్త ట్యూన్స్ అందించే పనిలో మణిశర్మ బిజీగా ఉన్నారు. ఇక మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా రిలీజ్ కి ముస్తాబవుతోంది. వర్మ దర్శకత్వంలో నాగార్జున చేసిన ఆఫీసర్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సినిమాలు హిట్ అయితే మల్టీ స్టారర్ మూవీ పై క్రేజ్ పెరిగిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus