నాగార్జున, నాని మల్టీ స్టారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే ?

  • March 12, 2018 / 01:49 PM IST

టాలీవుడ్ లో కథలనే కాదు … కాంబినేషన్లను కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. అటువంటి వాటిలో నాని, నాగార్జున కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఒకటి. “భలే మంచిరోజు”, “శమంతకమణి” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం మణిశర్మ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమయింది. నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ పాత్రలో కనిపించబోతున్న ఈ కామెడి ఎంటర్టైనర్.

ఈ నెల 18వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం నాగార్జున.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “ఆఫీసర్” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 25న విడుదల కానుంది. ఇక నాని ద్విపాత్రాభినయం చేసిన “కృష్ణార్జున యుద్ధం” షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి ముస్తాబవుతోంది. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus