స్వయంగా నాగార్జునే క్లారిటీ ఇచ్చారు… పుకార్లకు ఇక ఫుల్ స్టాప్..!

  • August 29, 2019 / 01:52 PM IST

అక్కినేని నాగార్జున అనారోగ్యం పాలయ్యారంటూ తాజాగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. అభిమానులు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని స్వయంగా నాగార్జునే తన సన్నిహితులతో మెసేజ్ పంపారు. నాగార్జునకు వచ్చింది కేవలం వైరల్ ఫీవర్. హైదరాబాద్ లో ఇప్పుడు అందరికీ జ్వరాలే…! వాతావరణం సడెన్ గా మారడం.. దానికి తోడు వాటర్ కూడా చేంజ్ అవ్వడంతో అందరికీ జ్వరాలు వస్తున్నాయి. మన కింగ్ నాగార్జున కి వచ్చింది కూడా అలాంటి ఫీవరే. అంతకుమించి ఇంకేం ఆరోగ్య సమస్యలు లేవు.

ఈ చిన్న జ్వరానికి పెద్ద పుకార్లు పుట్టుకురావడంతో నాగ్ ఇలా మెసేజ్ ఇచ్చి అందరినీ కూల్ చేసే ప్రయత్నం చేశారు. ‘ ‘మన్మథుడు 2’ సినిమా టైములో నాగార్జున చాలా వర్కౌట్ లు చేసి స్లిమ్ అయ్యే ప్రయత్నం చేశారు. అంతేకాదు యంగ్ గా కనిపించడానికి డైట్ కూడా ఫాలో అయ్యారు. షూటింగ్ సమయంలో నాగార్జున చేతికి కూడా గాయం అయ్యింది. ఇవన్నీ ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీశాయని” తెగ పుకార్లు వస్తున్నాయి. అవన్నీ వట్టి పుకార్లే అని తేలింది. ఇక ఇప్పుడు నాగార్జున హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో కుటుంబంతోనే గడుపుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus