మరో యువహీరోతో కలిసి నాగ్ మల్టీ స్టారర్ మూవీ!

  • January 16, 2018 / 10:41 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీ చేసిన స్టార్ హీరో ఎవరు? అంటే కింగ్ నాగార్జున పేరు ముందు వినిపిస్తుంది. తన తనయులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు విష్ణు, సుమంత్ తదితరులతో కలిసి సినిమాలు చేశారు. అలాగే నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “భలే మంచిరోజు”,  “శమంతకమణి” సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నాగార్జున మాఫియా డాన్ గా కనిపించనున్నారు. అయితే తెలుగు హీరోలతో కలిసి సినిమాలు చేయడమేకాదు.. తమిళ యువ హీరోలతోనూ కలిసి నడుస్తున్నారు.  తమిళ హీరో కార్తితో కలిసి ‘ఊపిరి’ సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు.

ఇప్పుడు మరొక తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలిసి మూవీ చేయబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ కి ధనుష్, నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అయితే నాగార్జున ఈ నిర్ణయం వెనుకాల ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా ఇతర భాషల్లో నటించి సాహసం చేయడం బదులు.. ఇతర పరిశ్రమల్లో ఉన్న హీరోలతో కలిసి నటిస్తే విజయానికి విజయం.. గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పారు. ఆ తర్వాత నాగ్  సోలో చిత్రాలు కూడా ఇతర భాషల్లో బాగా ఆడుతాయని అంచనా వేస్తున్నారు . అందుకే నాగార్జున ప్లాన్ సూపర్ అని అభినందిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున వర్మ దర్శకత్వంలో పోలీస్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రెండు మల్టీ స్టారర్ సినిమాలను పట్టాలెక్కించనున్నారు. ఏది ముందుగా మొదలవుతుందో ఇప్పుడే  చెప్పలేము.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus