నా ప్రేమ గురించి ముందుగా ఆ హీరోకే చెప్పాను : నమ్రత

  • August 1, 2019 / 05:48 PM IST

మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తన భర్త బిజినెస్ విషయాలను మొత్తం నమ్రత నే డీల్ చేస్తున్నారు. ఇక కుటుంబ విషయాలను కూడా నమ్రత దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. తన పిల్లలు గౌతమ్, సితార దగ్గర్నుండీ.. తన మామ గారు కృష్ణ గారి వరకూ నమ్రత చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే నమ్రతతో పెళ్ళైన తరువాత మహేష్ క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పాలి. ఆయన మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఇక నమ్రత తెలుగులో ‘వంశీ’ చిత్రం చేయడానికి ముందే బాలీవుడ్లో చాలా సినిమాలు చేసింది. ‘వంశీ’ చిత్రం సమయంలో మహేష్ తో ఈమె ప్రేమలో పడిందంట. మహేష్ ను ప్రేమిస్తున్నాననే విషయం మహేష్ కంటే ముందుగా ఓ హీరోకి చెప్పానంటూ నమ్రత ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొస్తుంది.

తాజాగా నమ్రత మీడియాతో మాట్లాడుతూ… “అప్పట్లో బాలీవుడ్‌లో చేసిన ‘వాస్తవ్’ సినిమాలో సహ నటుడుగా చేసిన సంజయ్ దత్‌ తో నాకు మంచి స్నేహం ఏర్పడింది. సంజయ్‌కు అప్పుడే 60 ఏళ్ళు నిండాయంటే ఆశ్చర్యంగా ఉంది. ‘వాస్తావ్’ సెట్లో సంజు ఎపుడూ చిన్న పిల్లాడిలా ప్రవర్తించే వాడు. సెట్లో అందరినీ కంటికి రెప్పలా చూసుకునే వాడు. ఆ సినిమా షూటింగ్ జరిగినన్నాళ్ళూ సంజయ్ నాతో పాటు సహ నటులతో కూడా ఎంతో సరదాగా ఉండేవారు. ఇక ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో నేను మహేష్ తో ప్రేమలో ఉన్నాను.. అనే విషయాన్ని ముందుగా సంజయ్ దత్‌కే చెప్పాను. మా ప్రేమ విషయం తెలిసిన మొదటి వ్యక్తి కూడా సంజయ్ దత్తే” అంటూ చెప్పుకొచ్చింది నమ్రత.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus