Nayanatara: పిల్లలతోనే నా రోజు మొదలవుతుంది.. నయనతార ఎమోషనల్ కామెంట్స్!

  • June 16, 2023 / 08:48 PM IST

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తరగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలుగుతున్నటువంటి ఈమె సినీ కెరియర్ లో ఎంతో ఒక మంచి సక్సెస్ సాధించారు. అయితే ఈమె వ్యక్తిగత విషయంలో కాస్త ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. ఈమె వ్యక్తిగత జీవితంలో ప్రేమలో బ్రేకప్ వంటివి ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రభుదేవా హీరో శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార వారితో బ్రేకప్ చెప్పుకొని దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

అయితే గత ఏడాది ఈమె (Nayanatara) తనని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి స్థిరపడ్డారు.అనంతరం ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఇలాసరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఈ విషయం కాస్త వివాదంగా మారిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వివాదం నుంచి బయటపడినటువంటి నయనతార విగ్నేష్ దంపతులతో వారి పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇకపోతే తమ మొదటి వార్షికోత్సవం సందర్భంగా తమ కవల పిల్లల మొహాలను కూడా రివీల్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నయనతార తన పిల్లల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ నేను నా గర్భం నుంచి తన పిల్లలకు జన్మనివ్వకపోయినా ప్రస్తుతం అమ్మతనాన్ని చాలా ఆస్వాదిస్తున్నానని ఎమోషనల్ అయ్యారు.

వారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితమే మారిపోయిందని తెలిపారు. ప్రతిరోజు తనకు తన పిల్లలతోనే ఉదయం ప్రారంభమవుతుందని తన పిల్లలతోనే రోజు పూర్తి అవుతుంది అంటూ ఈ సందర్భంగా నయనతార ఒక సాధారణ అమ్మలాగా తన పిల్లల పట్ల ప్రేమను చూపించడమే కాకుండా ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus