మొన్న తమన్ … నేడు దేవీ శ్రీ ప్రసాద్?

  • December 5, 2018 / 07:34 AM IST

రాంచరణ్ బోయపాటి కంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రం ఫస్ట్ సింగల్ ‘తందానె తందానె’ అనే పాటని డిసెంబర్ 3 న విడుదల చేసింది చిత్ర యూనిట్. చరణ్ కు ‘ఎవడు’ ‘రంగస్థలం’ వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ‘వినయ విధేయ రామ’ పాటలు ఆకట్టుకుంటాయని భావించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యిందంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు .

సాధారణంగా దేవి శ్రీ ప్రసాద్ తన ట్యూన్లనే రిపీట్ చేసినప్పటికీ, జనాలను తొందరగా ఆకట్టుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ‘వినయ విధేయ రామ’ మొదటి పాటకు మిశ్రమ స్పందన ఏర్పడింది. ఇదివరకు దేవి పాటలంటే మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్య దేవీ మ్యూజిక్ కు కూడా ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. మొన్నటికి మొన్న వచ్చిన ‘హలో గురు ప్రేమ కోసమే’ పాటలకి కూడా ఇలాంటి కామెంట్లే వినపడ్డాయి. ‘నేను లోకల్’ ఆల్బమ్ ను ‘యాజ్ ఇట్ ఈజ్’ దించేసాడంటూ దేవీని ట్రోల్ చేశారు. మొదట ఇలాంటి కామెంట్లన్నీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు పడేవి. ఇప్పుడు ఆ లిస్టులోకి దేవీని కూడా లాగడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus