మరో రీమేక్ కన్ఫర్మ్ చేసిన నిఖిల్

  • January 8, 2018 / 08:05 AM IST

ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కిర్రిక్ పార్టీ’ని తెలుగులో ‘కిరాక్ పార్టీ’గా రీమేక్ చేస్తున్న నిఖిల్ మరో రీమేక్ లో నటించడానికి సన్నద్ధమవుతున్నాడు. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న “కనితన్” చిత్రాన్ని తెలుగులో “స్పైడర్’ నిర్మాత ఠాగూర్ మధు నిర్మిస్తుండగా.. అందులో కథానాయకుడిగా నిఖిల్ ను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఠాగూర్ మధు వెల్లడించారు. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోష్ తెలుగు వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి.

అయితే.. తమిళ వెర్షన్ లో కథానాయికగా నటించిన కేతరీన్ నే తెలుగు వెర్షన్ కోసం కూడా తీసుకోనున్నారని వినికిడి. ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్న కేతరీన్ కూడా ఆఫర్ తనకు రాగానే ఏమాత్రం ఆలోచించలేదట. అది కూడా అసలే సూపర్ ఫామ్ లో ఉన్న నిఖిల్ సరసన కావడంతో తన కెరీర్ కి కూడా ఉపయోగపడుతుంది అనే భావనతో కేతరీన్ వెంటనే సరేనంది. మరి ఈ సినిమాతోనైనా కేతరీన్ కథానాయికగా నిలబడుతుందో లేదో చూద్దాం. ఇకపోతే.. నిఖిల్ ప్రస్తుతం “కిరాక్ పార్టీ” లాస్ట్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. మార్చి నుంచి సినిమాలు రిలీజ్ చేయకూడదని ఇండస్ట్రీ నిర్ణయించడంతో ఫిబ్రవరి నెలాఖర్లో “కిరాక్ పార్టీ” చిత్రాన్ని రిలీజ్ చేయడం కోసం సన్నద్ధమవుతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus