సావిత్రిగా నిత్య మీనన్

  • September 24, 2016 / 09:24 AM IST

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగ్ అశ్విన్. శేఖర్ ఖమ్ముల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఇతగాడు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తర్వాత తండ్రి అశ్వినీదత్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియాంకను పెళ్లి చేసుకుని వార్తలకెక్కిన అశ్విన్ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తన రెండో సినిమాగా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనికోసం చాలా పరిశోధన చేసిన అశ్విన్ కథ, కథనాలను సిద్ధం చేశాడు. అయితే ఆ మహానటి పాత్ర ఎవరు చేస్తారన్న అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తుంది. ఓ దశలో సిల్క్ స్మిత బయోపిక్ తో ప్రశంసలందుకున్న విద్యా బాలన్ ఈ పాత్రలో నటిస్తుంది అన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం నిత్యా మీనన్ సావిత్రిగా మెప్పించనుందిట. నిత్యా ఈ పాత్రకి వన్నె తెస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా నిర్మాత తదితరుల విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus