అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన నివేదా థామస్!

  • September 23, 2017 / 11:01 AM IST

నాని “జెంటిల్ మాన్” సినిమాతో  నివేదా థామస్ తెలుగు వారికీ పరిచయమంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. మళ్ళీ నాని సరసన నిన్నుకోరి మూవీ చేసింది. ఈ మూవీ కూడా విజయం సాధించింది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన జై లవ కుశ సూపర్ హిట్ అయింది. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో నివేదా థామస్ ఎమోషనల్ అయింది. అభిమానులకు స్పెషల్ లేఖను రాసింది. “ఒక్క సినిమా హిట్ కావడం స్పెషల్. చేసిన మొదటి మూడు సినిమాలను విజయంతం చేసి, తెలు అమ్మాయిగా పిలవడం కన్నా పెద్ద కాంప్లిమెంట్ మరొకటి ఉండదు” అని సంతోషాన్ని బయటి పెట్టింది.

“ఇలా ఆదరించిన మీకు నేను థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది” అని లేఖలో పేర్కొంది. చివరగా “జై లవకుశను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు. మళ్ళీ మరో అద్భుతమైన పాత్ర, సినిమాతో మీ ముందుకు వస్తాను” అని నివేదా థామస్ సొంతంగా లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లేఖతో ఆమెపై అభిమానం మరింత పెంచుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus