లైట్ తీస్కోమంటున్న “చెర్రీ”!!!

  • November 5, 2016 / 06:47 AM IST

టాలీవుడ్ మెగాస్టార్ అంటూ అభిమానులకు తన నటనతో మంచి సినిమాలు అందించిన మెగాస్టార్ తన వారసుడిగా రామ్ చరన్ తేజని టాలీవుడ్ లో దింపాడు…అయితే భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చెర్రీ…..తండ్రి అంత కాకపోయినా…తనదైన శైలిలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే తొలి రోజుల్లో తండ్రి చరిష్మాతో సూపర్ హిట్స్ అందుకున్న చెర్రీ…గత రెండు మూడు ఏళ్ల నుంచి ఫ్లాప్స్ తో కెరియర్ లో కాస్త వెనుకబడ్డాడు. ఇక తాజాగా తమిళ రీమేక్ ను నమ్ముకుని తని ఒరువన్ అనే సినిమాని ‘ధృవ’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇక అదే క్రమంలో ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ చిత్రం టీజర్, ఫర్స్ట్ లుక్ కాస్త నిరాశపరినప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న ఆలోచనలో ఊగిపోతున్నారు ఫ్యాన్స్.

అదే క్రమంలో ఆ మద్య ధృవ ఆడియో రిలీజ్ కి పవన్ కళ్యాన్ రాబోతున్నాట్లు వార్తలు వచ్చాయి…దీంతో చెర్రీ భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్ ని ఆహ్వానించి ఆడియో వేడుక చేస్తారని అనుకున్నారు. కానీ అనుకోకుండా చెర్రీ ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇచ్చాడు….షాక్ అంటే పవన్ ను ఆహ్వానించడం లేదా అంటే…?? కాదు కాసు అసలు ఈ ఆడియో వెడుకే చెయ్యకుండా డిరెక్ట్‌గా ఈనెల 9 న ధృవ ఆడియో నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. దీని వెనుక అసలు కారణం ఎంటా అంటే…..చిరు నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి దానికి చరణ్ నిర్మాత అన్న విషయం తెలిసిందే . అలాగే ధృవ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో ఆడియో వేడుక చేసి ఇబ్బంది పడటం కంటే రిలీజ్ కి ముందర ఓ భారీ ఈవెంట్ చేస్తే సరిపోతుందని భావిస్తున్నారట . మరి చెర్రీ ప్లాన్ ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus