నాలుగు పాటలతోనే రానున్న అరవింద సమేత

  • October 6, 2018 / 02:41 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీస్తారు. అతని డాన్స్ కోసమే థియేటర్ కి వెళ్లే అభిమానులు చాలామంది ఉన్నారు. అందుకే ప్రతి సినిమాలో కనీసం మూడు పాటలైనా డాన్స్ కి ప్రాధాన్యం ఉండే పాటలను దర్శకులు ప్లాన్ చేస్తుంటారు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేతలో రెండే ఉన్నాయి. ఇదే అభిమానులకు నచ్చడం లేదు. త్రివిక్రమ్, థమన్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వేగంగా థమన్ ఓ మంచి డాన్స్ ట్యూన్ ని రెడీ చేశారు. కంపోజింగ్ కూడా పూర్తి అయింది. దీనిని యాడ్ చేస్తామని చెప్పారు. కానీ అంత సమయం లేదని తెలిసింది. అందుకే నాలుగు పాటలతోనే సినిమాని రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం ఫిక్స్ అయింది.

పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించారు. అతనికి ఎన్టీఆర్ కి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాలో హైలెట్ కానున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమాలో క్లాస్ గా విలనిజం, హీరోయిజం చూపించిన వీరిద్దరూ.. ఇందులో మాస్ గా చూపించనున్నారు. హారిక హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 11 న రిలీజ్ కానుంది. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ అనేక రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus