రామ్ చరణ్ ఇంటికి వచ్చిన ఎన్టీఆర్!

  • December 15, 2017 / 07:32 AM IST

వ్యాపార సంబంధాలను స్థిరపరచడంతో పాటు.. అనుబంధాలను బలపరచడంలో ఉపాసన ముందుంటారు. వృత్తిగత, వ్యాపార పనులతో బిజీగా ఉన్నప్పటికీ మెగాస్టార్ కోడలు వేడుకలను నిర్వహించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ ఆసక్తితోనే తాజాగా తమ నివాసంలో ప్రీ క్రిస్మస్‌ వేడుకలు జరిపారు. ఇందుకోసం  ఉపాసన విస్తరాకులతో క్రిస్మస్‌ చెట్టును తయారు చేశారు. ఈ వేడుకలకు ఎన్టీఆర్‌ తో పాటు యువ కథానాయకుడు శర్వానంద్‌, ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ ఫొటోలను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. “ఈ క్రిస్మస్‌ చెట్టును విస్తరాకులతో నేనే తయారు చేశా. మిస్టర్‌ ‘సి’తో ఉన్న వ్యక్తులను గుర్తు పట్టగలరా?’ అంటూ ట్వీట్‌ చేశారు. రామ్ చరణ్ ఇంటికి ఎన్టీఆర్ రావడం ఇరు అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

వీరు ఇద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు .. ఫోటో రూపంలో బయటికి వచ్చింది. అంతేగానీ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే నిన్న ఎన్టీఆర్ చెర్రీ ఇంటికి పోవడంతో ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ నిర్ధారణకు వచ్చారు. అలాగే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్‌చరణ్‌ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నారు. రెండు పాటలు షూట్ చేస్తే ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. వెంటనే చెర్రీ బోయపాటి దర్శకత్వంలో సినిమా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ పట్టాలెక్కనుంది. అప్పటి లోపున ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాని కంప్లీట్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus