విభిన్న కథతో తారక్ ని మెప్పించిన బడా డైరెక్టర్

  • November 28, 2016 / 07:30 AM IST

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనేక కథలను విన్నారు. అందులో ఏది తారక్ మనసుని దోచుకోలేక పోయింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం డైరక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) చెప్పిన స్టోరీ బాగా నచ్చిందంట. మాస్ మహారాజ్ రవితేజతో పవర్ వంటి సూపర్ హిట్ చిత్రం తీసిన ఈ డైరక్టర్, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో ఎక్కువ టైమ్ తీసుకుని మంచి కథను రాసుకున్నారు.

ఈ మధ్యనే దానిని ఎన్టీఆర్ కి వినిపించారు. ఆ స్టోరీ లైన్ వినూత్నంగా ఉండడంతో తారక్ పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారంట. దీంతో బాబీ బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇందులో మాస్ అభిమానులను అలరించే అంశాలతో పాటు, క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విషయాలు మిక్స్ చేయనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సీన్ ని ప్రత్యేకంగా రాస్తున్నారని సమాచారం. డిసెంబర్ నాటికి స్క్రిప్ట్ పూర్తి అయితే జనవరిలో బాబీ, ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ పట్టాలెక్కడం ఖాయం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus