ఆగస్టు నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న రాజమౌళి మూవీ!

  • November 29, 2017 / 10:20 AM IST

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమా చేస్తారు? హీరో ఎవరు? ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు దాదాపు ఫిక్స్ అయ్యాయి. అధికారికంగా ఎవరూ ప్రకటించకపోయినప్పటికీ.. రాజమౌళి పోస్ట్ చేసిన ఒక ఫోటో అనేక ప్రశ్నలకు జవాబు అయింది. అయినా కొంతమందికి నమ్మకం కుదరలేదు. మెగా హీరో, నందమూరి హీరోలు నటించే అవకాశం లేదని కొట్టిపడేశారు. కానీ ఈ కాంబినేషన్ ని బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సెట్ చేసిందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అతను చెప్పిన కథ బాగుండడంతో కలిసి నటించడానికి ఇద్దరూ ఒకే చెప్పారని టాక్. అంతేకాదు ఇందులో ఎన్టీఆర్, చరణ్ అన్నదమ్ములుగా నటించనున్నారు.

ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చేస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా చేయనున్నారు. ఇది పూర్తి అయ్యేసరికి వచ్చే సంవత్సరం ఆగస్టు అవుతుంది. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని కంప్లీట్ చేయడానికి అంతే సమయం పడుతుంది. అందుకే అప్పుడే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మల్టీస్టారర్ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడానికి డీవీవీ దానయ్య సిద్ధంగా ఉన్నారు. స్క్రిప్ట్ పనులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus