మహానటిలో నటించడంపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్!

  • September 22, 2017 / 12:46 PM IST

తెలుగువారు గర్వించే నటి సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. సావిత్రిగా కీర్తిసురేష్ నటిస్తుండగా, సమంత కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో సావిత్రి జీవితంలో అటు వ్యక్తిగతంగానూ, ఇటు వృత్తి పరంగానూ చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలను నాగ్ అశ్విన్ చూపించనున్నారు. సావిత్రి సినీ కెరీర్ కి సంబంధించి ఆమె అప్పటి అగ్ర కథానాయకులందరితోనూ నటించారు. జెమినీ గణేషన్ పాత్రలో యువ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ‘మిస్సమ్మ’,  ‘గుండమ్మ కథ’ వంటి ఎన్నో చిత్రాల్లో సావిత్రి, ఎన్టీఆర్ తో కలిసి నటించింది.

ఆ మహానుభావుడి పాత్రలో ఆయన మనవుడు ఎన్టీఆర్ ని నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను తారక్ ఖండించారు. ఇప్పటివరకు తనను ఎవరూ కలవలేదని వివరించారు. జై లవకుశ ప్రమోషన్లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఓ మాట్లాడుతూ ” తాత రోల్లో నేను మాత్రమే నటించాలని రూల్ ఏమి లేదు. ఎవరైనా నటించవచ్చు. ఆయనలా నటించడం చాలా కష్టం” అని ఎన్టీఆర్ వెల్లడించారు. దీంతో మహానటుడు పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఆసక్తి నెలకొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus