తెలుగు టీవీ చరిత్రలో భారీ రెమ్యునరేషన్ ఇదేనా..?

  • December 16, 2020 / 05:35 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపై సత్తా చాటి బుల్లితెరపై కూడా పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్ గా వ్యవహరించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే పలు కారణాల వలన ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మరోసారి ఓ పాపులర్ షోకి హోస్ట్ గా వ్యవహరించడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో ప్రసారం చేశారు.

కానీ ఆశించిన స్థాయిలో టీఆర్ఫీ రాలేదు. నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్లను హోస్ట్ గా పెట్టినా వర్కవుట్ కాలేదు. దీంతో ఈసారి పక్కాగా ప్లాన్ చేసి ఎన్టీఆర్ ని రంగంలోకి దింపుతున్నారు. ఇదివరకు స్టార్ మాలో ప్రసారమైన ఈ షో ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ షో టైటిల్ లో కూడా మార్పులు రానున్నారు. ఈ షోకి హోస్ట్ గా ఎన్టీఆర్ ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డారట. అంతేకాదు ఇప్పటివరకు టెలివిజన్ చరిత్రలో లేని విధంగా ఎన్టీఆర్ కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తం ఈ షో 60 ఎపిసోడ్ లు. ఒక్కో ఎపిసోడ్ కి ఎన్టీఆర్ కి ఇచ్చే రెమ్యునరేషన్ రూ.30 లక్షలు. అంటే మొత్తంగా చూసుకుంటే జెమినీ టీవీ నుండి ఎన్టీఆర్ కి వచ్చేది రూ.18 కోట్లు. ఇప్పటివరకు ఏ షోకి కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. తెలుగు టీవీ చరిత్రలో అతి పెద్ద రెమ్యునరేషన్ ఇదే అనుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత త్రివిక్రమ్ తో మరో సినిమా చేయబోతున్నాడు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus