వీళ్ళు ఇక మారరా??

  • June 21, 2016 / 08:08 AM IST

మెగా స్టార్ చిరంజీవి..కలెక్షన్ కింగ్ మోహన్ బాబు…వీళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకరికొకరు అన్నట్లుగా ఉన్న వీళ్ళు, ఆ తరువాత ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ, బద్డ
శత్రువుల్లా మారిపోయారు. వీరి వైరం ఎంతవరకూ వచ్చింది అంటే… స్టేజ్ పైనే ఒకరికొకరు బహిరంగంగా విమర్శలు చేసుకునే అంత. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరూ టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీ అని అందరికీ తెలిసిందే.

అయితే ఒక పక్క వీలు చిక్కినప్పుడల్లా ఒకరిపై మరొకరు శెటైర్స్ వేసుకుంటూనే, ఎదురుపడినప్పుడు మాత్రం ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరి మధ్య వైరం ఇంకా కొనసాగుతుంది అని మొన్న జరిగిన ఫిల్మ్ ఫేర్ లో మళ్ళీ బయటపడింది….ఇంతకీ ఏం జరిగింది అంటే…మొన్న శనివారం జరిగిన ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ లో మోహన్ బాబుకు ఫిలిం ఫేర్ జీవన సాఫల్య పురస్కారం అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును మోహన్ బాబుకు అతడి గురువు దాసరి అందించారు. అతిరధమహారధులు అందరూ హాజరయిన ఈ వేడుకకు చిరుకు సైతం ఆహ్వానం ఉన్నా…ఈ పురస్కారానికి చిరు హాజరు కాలేదు. డుమ్మా కొట్టారేమో అనుకునే లోపే…..మోహన్ బాబు బయటకు వెళ్ళిపోగానే చిరంజీవి నాటక ఫక్కీలో ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రాంగణంలోకి అడుగు పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ ను చూసిన వారంతా మోహన్ బాబు చిరంజీవిల మధ్య ఇంకా కోల్డ్ వార్ రన్ అవుతూనే ఉంది అని తెలుస్తుంది. దాదాపుగా సినిమా కరియర్ ముగింపు దశలో ఉన్న ఈ అలనాటి
యువ హీరోలు ఇప్పటికైనా మారితే బావుంటుంది అని అభిమానులు ఫీల్ అవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus