Sukumar, Ram Charan: రంగస్థలం సినిమాకు సీక్వెల్ రానుందా?

  • December 24, 2021 / 06:51 PM IST

భిన్నమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ద్వారా చరణ్ కు నటుడిగా మంచి పేరు దక్కడంతో పాటు చరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈ సినిమాలోని పాత్రకు తన నటనతో చరణ్ ప్రాణం పోశారు.

దర్శకుడు సుకుమార్ క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్ తో రంగస్థలం సినిమా స్థాయిని పెంచారు. అయితే రంగస్థలం కాంబో రిపీట్ కానుందని సమాచారం. చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ సక్సెస్ తో సంతోషంలో ఉన్న సుకుమార్ ఫిబ్రవరి నెల నుంచి పుష్ప పార్ట్2 పనులతో బిజీ కానున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుంది.

ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత చరణ్ సుకుమార్ కాంబో మూవీ పట్టాలెక్కనుంది. ఈ సినిమా రంగస్థలం సినిమాకు సీక్వెల్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సుకుమార్ చరణ్ తో కొత్త కథను తెరకెక్కిస్తారో లేక రంగస్థలం సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు సుకుమార్ ఈ బ్యానర్ లోనే వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

పుష్ప పార్ట్1 విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో పార్ట్2 కథ విషయంలో సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. ఈ సినిమా కథ కాపీ అని విమర్శలు వ్యక్తమైనా సుకుమార్ మాత్రం ఆ విమర్శల గురించి అస్సలు స్పందించలేదు. పుష్ప పార్ట్1కు సుకుమార్ ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకున్నారని బోగట్టా. సినిమాసినిమాకు సుకుమార్ కు క్రేజ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా పెరుగుతుండటం గమనార్హం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus