కళ్యాణ్ రామ్ నిర్మాణంలో మరో మూవీ చేయనున్న ఎన్టీఆర్!

  • June 14, 2018 / 06:46 AM IST

హీరోగానూ, నిర్మాతగానూ రెండు బాధ్యతలను మోస్తూ ముందుకు వెళ్తున్న టాలీవుడ్ హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. రీసెంట్ గా కల్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో జై లవ కుశ సినిమా చేశారు. తొలిసారిగా అన్న బ్యానర్లో ఎన్టీఆర్ నటించి విజయాన్ని ఇచ్చారు. నష్టాల్లో ఉన్న అన్నని బయటపడేశారు. లాభాలను అందించారు. ముందుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా లభాల్లో తారక్ వాటా అందుకున్నారు. కళ్యాణ్ రామ్ మళ్ళీ తమ్ముడితో మూవీ చేయాలనీ అనుకుంటున్నారు. అతను జయేంద్ర దర్శకత్వంలో నటించిన నా నువ్వే ఈరోజు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా తన తదుపరి సినిమాల గురించి మీడియాతో చెప్పారు.

“ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నేను హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాం. ఆ తరువాత సినిమా ఎన్టీఆర్ తో ఉంటుంది” అని కల్యాణ్ రామ్ వివరించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ ‘ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం దసరాకి రిలీజ్ కానుంది.  దాని తర్వాత  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ మొదలెట్టనున్నారు. ఇది దాదాపు రెండేళ్లు సాగనుంది. ఆ తర్వాతే కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ డేట్స్ కేటాయించనున్నారు. అయినా అప్పటి వరకు కళ్యాణ్ వెయిట్ చేసేలా ఉన్నారు. ఇలా తారక్ వరుసగా చేయనున్న మూడు సినిమాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus