Sithara Entertainments: మూడో సినిమా కూడా అనౌన్స్ చేశారు..ఆ డైరెక్టర్ ని వదలట్లేదుగా!

  • April 6, 2023 / 07:39 PM IST

ఓ నిర్మాణ సంస్థలో ఓ దర్శకుడు ఎన్నడూ చూడని పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తే చాలు.. అదే బ్యానర్లో మళ్లీ సినిమా చేసే అవకాశం లభిస్తుంది. నిర్మాత కూడా ఆ దర్శకుడిని బయటకు పంపడానికి ఇష్టపడడు. అనిల్ రావిపూడినే తీసుకుంటే.. దిల్ రాజు అంత ఈజీగా బయట బ్యానర్ కు పంపలేదు. మొత్తానికి బాలకృష్ణ 108 వ సినిమా కోసం బయటకు కదిలాడు అనిల్ రావిపూడి. షైన్ స్క్రీన్స్ లో అనిల్ రావిపూడి – బాలయ్య సినిమా రూపొందుతోంది.

ఇక అనిల్ రావిపూడి లానే మరో దర్శకుడు కూడా ఓ బ్యానర్ (Sithara Entertainments) లో లాక్ అయిపోయాడు. అతను మరెవరో కాదు వెంకీ అట్లూరి. తొలిప్రేమ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఇతను అటు తర్వాత మిస్టర్ మజ్ను , రంగ్ దే సినిమాలను కూడా తెరకెక్కించాడు. అయితే ఇందులో తొలిప్రేమ హిట్ అయ్యింది… మిస్టర్ మజ్ను ఫ్లాప్, రంగ్ దే యావరేజ్ గా నిలిచాయి. రంగ్ దే చిత్రాన్ని ఇతను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య దేవర నాగ వంశీ నిర్మాణంలో చేశాడు.

ఆ వెంటనే ఇదే బ్యానర్లో ధనుష్ తో సార్ అనే సినిమా చేశాడు. ఇది ద్విభాషా చిత్రం. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే ఇప్పుడు ఈ దర్శకుడితో మళ్లీ సినిమా చేయడానికి రెడీ అయ్యింది ఈ సంస్థ. ఈరోజు వెంకీ పుట్టినరోజు కాబట్టి.. అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా వెంకీ తోనే అని చెప్పేశారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus