Padmalaya Studios: తల్లి నాగరత్నమ్మ, ఎన్టీఆర్‌లతో కృష్ణ.. వైరల్ అవుతున్న రేర్ పిక్స్..!

  • November 21, 2022 / 08:57 PM IST

సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు ప్రేక్షకులను వదిలి వెళ్లిపోయి వారం రోజులవుతోంది. నవంబర్ 15 తెల్లవారు జామున విన్న ఈ షాకింగ్ న్యూస్ నుండి ఇంకా తేరుకోవడం కష్టంగానే ఉంది. గతకొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా, విన్నా కానీ ఆయన ప్రొఫెషన్, పర్సనల్ విషయాల గురించిన వార్తలే.. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు.. కొన్ని అరుదైన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి..

కృష్ణ హైదరాబాద్ ఫిలింనగర్‌లో నెలకొల్పిన పద్మాలయా స్టూడియోస్ 21 నవంబర్ 1983న ప్రారంభమైంది. 2022 నవంబర్ 21 నాటికి 39 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. కృష్ణ అభిమాన నటుడు నటరత్న ఎన్టీరామారావు చేతుల మీదుగా ఈ స్టూడియో ప్రారంభోత్సవంజరిగింది. కృష్ణ గారి తల్లి నాగరత్నమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని.. కొడుకు సాధించిన మరో అరుదైన ఘనతను చూసి సంతోషించారు. అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన స్ఫూర్తితోనే కృష్ణ సినీ రంగ ప్రవేశం చేశారనే సంగతి తెలిసిందే.

పద్మాలయా స్టూడియో ద్వారా ఎంతో మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పించడమే కాక.. ఇదే బ్యానర్ మీద దర్శక నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను అందించారు కృష్ణ. అప్పట్లో అంగరంగవైభవంగా జరిగిన పద్మాలయా స్టూడియోస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus