ఈ నెల 28 న రిలీజ్ కానున్న ‘పైసా వసూల్’ స్టంపర్

  • July 25, 2017 / 12:43 PM IST

నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది .అది కూడా ఈ వారంలోనే పూర్తి కానుంది . ఈ నెల 28 న ‘పైసా వసూల్’ కి సంబంధించిన ‘స్టంపర్’ ని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భం గా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – “నందమూరి బాలకృష్ణ తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గానూ, గర్వం గానూ ఉంది. నా కెరీర్ లోనే ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. బాలకృష్ణ గారు ఈ పాత్ర లో లీనమైన తీరు చూసి వండర్ అయిపోయాను. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో రేపు 28 న విడుదల కానున్న ‘స్టంపర్’ చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్ గా అందరూ విడుదల చేసే టీజర్, ట్రైలర్ కి పూర్తి భిన్నం గా ఈ ‘స్టంపర్’ ఉంటుంది” అని చెప్పారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ” బాలకృష్ణ -పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వం గా ఫీల్ అవుతున్నాను . మా భవ్య క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ఈ వారం తో ప్యాచ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావొచ్చాయి . మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా చురుగ్గా సాగుతూ ,తుది దశకు చేరుకుంటోంది. ఆడియో ఫంక్షన్ ని త్వరలోనే గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.nbk 101 fever begins పేరుతో బాలకృష్ణ గారు ఇప్పటివరకూ నటించిన 100 సినిమాల విశేషాల తో ఒక వీడియో కర్టెన్ రైజర్ రిలీజ్ చేసాం. అది సోషల్ మీడియా లో ఇండియా లెవెల్ లో బాగా ట్రెండింగ్ అవుతోంది. ” అని తెలిపారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus