పైసా వసూల్ స్టంపర్ గురించి వివరించిన చిత్ర బృందం

  • July 26, 2017 / 08:19 AM IST

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ నెల 28 న ఉదయం 10.12 గంటలకు  ‘పైసా వసూల్’ కి సంబంధించిన ‘స్టంపర్’ ని రిలీజ్ చేయనున్నారు. తొలిసారి ఈ స్టంపర్ పేరు వినడంతో అందరూ స్టంపర్ అంటే ఏంటి ? అని ప్రశ్నించుకుంటున్నారు. ఫస్ట్ లుక్, ప్రీ లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ఆడియో వేడుక , ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ఎన్నో రకాలుగా సినిమాకి ప్రచారం కల్పిస్తుంటారు.

అందులో భాగమే స్టంపర్. ఇది టీజర్ కి ఎక్కువగా, ట్రైలర్ కి తక్కువగా నిడివి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమా ప్రమోషన్ లో ఈ విధానం వాడుతుంటారు. ఇప్పుడు బాలయ్య సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ లో పరిచయం కాబోతుంది. హీరోయిన్లుగా శ్రీయ, ముస్కాన్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కీలకరోల్ పోషిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న పైసా వసూల్ సెప్టెంబర్ 29 న రిలీజ్ కాబోతోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus