Pawan Kalyan: మరో సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్.. ఏం చెప్పారంటే?
- August 16, 2023 / 02:48 PM ISTByFilmy Focus
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు 2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తాజాగా పవన్ మాట్లాడుతూ అక్రమాస్తులు, దోపిడీ గురించి సంచలన ప్రకటన చేయగా ఆ ప్రకటన సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అక్రమ ఆస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చేవారికి గిఫ్ట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విధంగా చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా తాను పాలన సాగిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న స్కీమ్స్ తో పోల్చి చూస్తే బెస్ట్ స్కీమ్స్ ను అమలు చేస్తామని పవన్ కామెంట్లు చేశారు. తమ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం బలంగా పని చేస్తానని పవన్ అన్నారు.

ప్రజా కోర్టు పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయనున్నానని పవన్ వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బలిదానాలు చేసిన మహనీయులను గౌరవించుకుంటామని పవన్ పేర్కొన్నారు. తమ పార్టీ మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యం కానుందని సమాచారం అందుతోంది. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పవన్ కు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

















