పవన్, త్రివిక్రమ్ సినిమాకు పెరిగిన బడ్జెట్

  • May 11, 2017 / 07:47 AM IST

తెలుగు సినిమా వంద కోట్లు కలక్షన్ చేయాలనుకోవడం అనే మాట పోయి.. వందకోట్లతో తెరకెక్కాలనే కొత్తనానుడి టాలీవుడ్ లో విస్తరిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీ వంద కోట్లతో రూపుదిద్దు కుంటోంది. ప్రభాస్ సాహో సినిమాని 150 కోట్లతో నిర్మించనున్నారు. ఎన్టీఆర్ జైలవకుశని కూడా వందకోట్ల బడ్జెట్ ఫిల్మ్ గా చెబుతున్నారు. సో పవన్ కళ్యాణ్ మూవీకి కూడా వందకోట్ల సినిమాగా చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్ కళ్యాణ్ 25 మూవీకి మొదట 80 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. ఐదు కోట్లతో రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారు. అక్కడే ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది.

కథని మరింత రిచ్ గా చూపించాలంటే మరో 20  కోట్లు అవసరమని డైరక్టర్ కోరడంతో అందుకు నిర్మాత  రాధా కృష్ణ అంగీకరించినట్లు తెలిసింది. హీరోయిన్లుగా అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లు నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నారు. సీనియర్ నటి కుష్బూ కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకి గోకుల కృష్ణుడు అనే ఇరు పరిశీలిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus