సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా నిర్మించనున్న పవన్ కళ్యాణ్

  • March 4, 2017 / 09:59 AM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి మెగా హీరోల ప్రోత్సాహం ఉంది. చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మేనల్లుడు తేజు స్టార్ హీరోగా ఎదగాలని ఆశిస్తున్నారు.  పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్నసాయి ధరమ్ తేజ్ తిక్క, విన్నర్ సినిమాలతో వెనక్కి వెళ్ళాడు. ఇవి ఆశించినంత విజయం సాధించకపోవడంతో తేజు అప్ సెట్ లో ఉన్నాడు. అతన్ని హిట్ ట్రాక్ లోకి తీసుకురావాలని చిన మామయ్య పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్నీ కాటమరాయుడు నిర్మాత, స్నేహితుడు అయిన శరత్ మరార్ కి  పవర్ స్టార్ చెప్పినట్లు సమాచారం.

మీడియం రేంజ్ బడ్జెట్ తో తేజు సినిమా ప్లాన్ చేస్తానని నిర్మాత కూడా అంగీకారం తెలిపినట్లు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాటమరాయుడు రిలీజ్ పనుల్లో బిజీగా ఉండడం ఆ ఈ ప్రాజక్ట్ ని పక్కన పెట్టారని, మార్చి 28 తరవాత తేజు సినిమాపై శరత్ మరార్ దృష్టి పెట్టనున్నట్లు తెలిపాయి. ఈ చిత్రానికి పవన్ కి ఇష్టమైన డైరక్టర్లో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus