కీర్తి సినిమాని ఎంత‌కు అమ్మారంటే?

  • June 20, 2020 / 03:40 PM IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పెంగ్విన్’ చిత్రం నిన్న ఓటిటిలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ఈ చిత్రం విడుదలయ్యింది. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్, ఎమోషనల్ థ్రిల్లర్ అని కీర్తి సురేష్ చెప్పిన రేంజ్లో ‘ఈ సినిమా లేదనే’ కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

కానీ సెకండ్ హాఫ్ మొత్తం సినిమా తేలిపోయింది. మనం ఈ మధ్య కాలంలో చూసిన విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమాలో క్లైమాక్స్ మాదిరే.. ‘పెంగ్విన్’ క్లైమాక్స్ కూడా ఉంది.సోషల్ మీడియాలో కూడా ఇదే డిస్కషన్ జరుగుతున్నది. ‘జోకర్ గెటప్ లో కనిపించే వ్యక్తి కూడా చాలా కామెడీగా ఉందని’ నెటిజన్లు చెబుతున్నారు. అయితే చాలా రోజులుగా కాస్త క్రేజ్ ఉన్న సినిమా ఏది విడుదల కాలేదు. ఈ క్రమంలో ‘పెంగ్విన్’ ను ఓటిటిలో విడుదల చేశారు కాబట్టి.. ఎక్కువ మందే చూసారు. ఈ చిత్రాన్ని చాలా లో బడ్జెట్ లో తెరకెక్కించారు. ఇక అమెజాన్ వారు 7.5 కోట్లు చెల్లించి ఈ చిత్రాన్ని ‘పెంగ్విన్’ నిర్మాతల నుండీ కొనుగోలు చేశారట.

వ్యూయర్ షిప్ ను బట్టి మిగిలిన ఎమౌంట్ ను చెల్లిస్తామని అమెజాన్ వారు డీల్ కుదుర్చుకున్నారట. సినిమాని ఎంత సేపు చూసారు అనే దాని పై.. మిగిలిన పే ఉంటుంది. ఆ ప్రకారం చూసుకుంటే.. ఈ 3 రోజుల్లో ‘పెంగ్విన్’ ను ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి.. నిర్మాత సేఫ్ అయిపోయినట్టే అని తెలుస్తుంది. దాంతో ‘పెంగ్విన్’ సక్సెస్ అయినట్టే అని చెప్పాలి..!

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus