రామ్ చరణ్ సినిమా కథలో రాజకీయం

  • February 17, 2018 / 06:31 AM IST

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న రంగస్థలం సినిమాపై రోజురోజుకి ఆసక్తి పెరిగిపోతోంది. సౌండ్ ఇంజినీర్ చిట్టి బాబుగా చెర్రీ టీజర్ లో అదరగొట్టగా.. మరో టీజర్ లో సమంత రామలక్ష్మి గా అలరించింది. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వర పరిచిన పాటల్లో మొదటి పాట “ఎంత సక్కగున్నావే” రీసెంట్ గా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ సాహిత్యానికి దేవీ, స్వరం, సంగీతం తోడై సంగీత ప్రియుల మనసులు దోచుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని మార్చి 30 న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.

అయితే ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇందులో రాజకీయ కోణం కూడా ఉండబోతోందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. లోకల్ పాటిటిక్స్ ఈ చిత్రంలో కీలకం కానున్నట్లు తెలిసింది. సర్పంచ్ ఎన్నికల సన్నివేశాలు ఈ సినిమాలో ప్రధానంగా ఉండబోతున్నాయని సమాచారం. ఇందులో చరణ్ కి అన్నగా ఆది పినిశెట్టి కనిపించనున్నారు. అతనే సినిమాలో విలన్ అని టాక్. ఆలాగే జగపతి బాబు కూడా ప్రధాన పాత్రలో నటించారు. డీజే బ్యూటీ పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus