జిగేల్ రాణి పాట గురించి స్పందించిన పూజా హెగ్డే

  • October 23, 2018 / 11:58 AM IST

ప్రస్తుతం పూజా హెగ్డే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నటిగా అడుగుపెట్టి చాలా రోజులకి “అరవింద సమేత వీర రాఘవ” సినిమా రూపంలో మంచి హిట్ అందుకుంది కాబట్టి. ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత “ఒక లైలా కోసం”లో నటించింది. ఈ చిత్రాల్లో నటనకి అభినందనలు వస్తున్నాయి కానీ సరైన విజయం అందలేదు. హిందీలో ఆమె చేసిన మొహంజదారో సినిమా కూడా ఫెయిల్ అయింది. దీంతో దువ్వాడ జగన్నాథంలో స్టైల్ మార్చింది. బికినీ అందాలతో అందరినీ పడగొట్టేసింది. ఆ సినిమా కూడా కలక్షన్ల వేటలో తడబడింది. కానీ పూజాకి పాపులారిటీ తెచ్చిన మూవీ రంగస్థలం. ఇందులో ఆమె చేసిన జిగేల్ రాణి పాటతో పాటు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ గురించి తాజాగా పూజా తన అభిప్రాయాన్ని చెప్పింది.

“నన్ను “జిగేలు రాణి” చేయమని చెప్పినప్పుడు ముందుగా పాట విన్నాను. జానపద గీతం తరహాలో ఉన్న ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట జనంలోకి బాగా వెళుతుందనీ .. సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అనిపించింది. నాకు మంచి క్రేజ్ తెస్తుందని కూడా ఊహించాను. అందువల్లనే రెండో ఆలోచన లేకుండా ఈ పాట చేయడానికి అంగీకరించాను. ఈ పాట విషయంలో నేను ఏదైతే అనుకున్నానో .. అదే జరిగింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా మహేష్, ప్రభాస్ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమా లు హిట్ అయితే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ జాబితాలో ముందు వరుసలో ఉండడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus