Pooja Hegde: ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ ఫలితాల పై పూజా హెగ్డే కామెంట్స్!

  • April 18, 2023 / 08:21 PM IST

పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘ముకుంద’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ అటు తర్వాత బాలీవుడ్లో హృతిక్ రోషన్ కు జోడీగా మొహెంజో దారో సినిమాలో ఈమెకు ఛాన్స్ రావడంతో తెలుగులో ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని పక్కనపెట్టేసి వెళ్లి ఆ సినిమా చేసింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

దీంతో పూజా హెగ్డే (Pooja Hegde) పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఆమె పై పడ్డ ఐరన్ లెగ్ ముద్రని చెరిపేశాడు. అప్పటి నుండి ఆమెకు అన్నీ హిట్లే..! కానీ గత ఏడాది మాత్రం ఈమెకు అస్సలు కలిసి రాలేదు. ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. అలాగే ‘బీస్ట్’ ‘సర్కస్’ వంటి సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.

దీంతో పూజా హెగ్డే ని ఐరన్ లెగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే వరుస ఫెయిల్యూర్స్ పై పూజా హెగ్డే తాజాగా స్పందించింది.’అవును నేను నటించిన గత 4,5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ నేను ఫెయిల్ అవ్వలేదు. తన పర్ఫామెన్స్‌కు, డ్యాన్సులకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఈ సినిమాల వల్ల నాకు నష్టమేమీ జరగలేదు, ప్రతీది కూడా ఎక్స్పీరియన్స్’ అంటూ చెప్పుకొచ్చింది మన బుట్టబొమ్మ. ఇక పూజ హెగ్డే నటించిన బాలీవుడ్ చిత్రం ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ చిత్రం ఏప్రిల్ 21 న విడుదల కాబోతోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus