Pooja Hegde: మరోసారి ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతున్న పూజా హెగ్డే..!

  • July 17, 2021 / 03:44 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. ‘యువసుదా ఆర్ట్స్’ మరియు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని తీర్చిదిద్దాలని కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నాడు. ఆల్రెడీ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది.

ఒకసారి సెట్స్ పైకి వెళితే.. 6 నెలల్లో షూటింగ్ ను ఫినిష్ చేయాలని అతను ప్లాన్ చేస్తున్నాడు. ఓ పక్క మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీని తెరకెక్కిస్తున్న కొరటాల శివ.. మరోపక్క ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశాడు. ల్రెడీ హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసేసారు. అందుతున్న సమాచారం ప్రకారం.. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. అంతకు ముందు కియారా అద్వానీ, జాన్వీ కపూర్ వంటి వారి పేర్లు వినిపించాయి కానీ..

చివరికి పూజా హెగ్డేనే ఫైనల్ అయినట్టు వినికిడి. గతంలో ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమేత’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది పూజా హెగ్డే..! ఇక కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో కూడా ఈమె రాంచరణ్ కు జోడీగా నటిస్తుంది. ఇప్పుడు వీళ్లిద్దరితో కలిసి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు స్పష్టమవుతుంది. సెప్టెంబర్ నుండీ ఈ చిత్రం షూటింగ్ మొదలుకాబోతుందని వినికిడి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus