రామ్ చరణ్ తో పూజ హెగ్డే చిందులేసేదప్పుడే

  • January 18, 2018 / 01:00 PM IST

రామ్ చరణ్ ‘ధృవ’ అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోపాటు ప్రత్యేక దృష్టి సారించి మరీ నటిస్తున్న సినిమా ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తోపాటు ఆఖరి షెడ్యూల్ కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. రామ్ చరణ్ సరసన కథానాయికగా సమంత నటిస్తున్న ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ మరో ముఖ్యపాత్ర పోషిస్తుండగా.. ఈ చిత్రంలో డీజే బ్యూటీ పూజా హెగ్డే కూడా ఓ ప్రత్యేక గీతంలో మెరవనున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం కొంచెం ప్యాచ్ వర్క్, రామ్ చరణ్-మహేష్ కాంబినేషన్ సీన్స్ మరియు పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తయ్యింది. అయితే.. రామ్ చరణ్-పూజా హెగ్డేల మీద ఫిబ్రవరిలో స్పెషల్ సాంగ్ షూట్ చేయనున్నారట. ఆ సాంగ్ తో చిత్రీకరణ పూర్తయినట్లే. కాకపోతే.. సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఇబ్బందిపడుతున్నారు. అయితే.. దేవిశ్రీప్రసాద్ మాత్రం “రంగస్థలం” కోసం కెరీర్ బెస్ట్ ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశాడని వినికిడి.
“ధృవ” తర్వాత దాదాపు సంవత్సరన్నర గ్యాప్ తో రిలీజవుతున్న “రంగస్థలం” సూపర్ హిట్ అవ్వడం రామ్ చరణ్ కు మాత్రమే కాదు “నాన్నకు ప్రేమతో” తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని సుకుమార్ తెరకెక్కించిన సినిమా కూడా కావడం వల్ల “రంగస్థలం” హిట్ అవ్వడం ఇప్పుడు చాలా అవసరం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus