పూజా హెగ్డే కోసం హోటల్ రూమ్ ని డబ్బింగ్ స్టూడియో చేసిన అరవింద టీమ్

  • October 5, 2018 / 06:42 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలక్షన్ల వేట మొదలు పెట్టడానికి ఇంకా ఆరురోజుల సమయం మాత్రమే ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ తొలిసారి నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ఈనెల 11 న థియేటర్లోకి రానుంది. అందుకే చిత్ర బృందం రాత్రి పగలు అని తేడా లేకుండా శ్రమిస్తోంది. ఈ సినిమాలో అందరూ డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. దాదాపు అందరూ సొంత వాయిస్ వినిపిస్తున్నారు. పూజా హెగ్డేతో కూడా త్రివిక్రమ్ తొలిసారి ఇందులో సొంతంగా డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఆమె కొన్ని సీన్లకు డబ్బింగ్ చెప్పింది. మరికొన్ని సీన్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే పూజా మాత్రం హిందీ సినిమా ‘హౌస్‌ఫుల్‌-4’లో నటిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ రాజ‌స్తాన్‌లోని జైస‌ల్మీర్‌లో జరుగుతోంది. అందువల్లే ‘అరవింద…’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా హాజరు కాలేదు. అయితే మిగిలిన సన్నివేశాలకు డబ్బింగ్ ఎలా పూర్తి చేయాలనీ పూజ ఆలోచించి త్రివిక్రమ్ టీమ్‌ని జైస‌ల్మీర్‌లోని త‌న హోట‌ల్ రూమ్‌లో డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు చేయమని అడిగింది. అలాగే ఏర్పాటు చేశారు. దాంతో పగలు ‘హౌస్‌ఫుల్‌-4’ షూటింగ్ చేసి, రాత్రి వేళల్లో “అరవింద సమేత”కు డబ్బింగ్ కంప్లీట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus