ఓ డైరెక్ట‌ర్ పై పూనమ్ సంచలన కామెంట్స్

  • May 11, 2018 / 07:11 AM IST

మాయ జాలం, ఒక విచిత్రం, వినాయకుడు, గగనం వంటి చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్.. పోటీని తట్టుకోలేక వెండితెర నుంచి పక్కకు తప్పుకుంది. ప్రస్తుతం బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న స్వర్ణఖడ్గం సీరియల్లో నటిస్తోంది. వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరియల్ లో పూనమ్ కౌర్ ఒక రాజ్యానికి రాణిగా అలరించనుంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా దగ్గరగా ఉన్న పూనమ్.. తాజాగా ఓ డైరక్టర్ పై విమర్శలు గుప్పించింది. “ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న ఓ డైరెక్ట‌ర్ సినిమాల‌ను మాత్ర‌మే కాకుండా మ‌నుషుల్ని కూడా డైరెక్ట్ చేస్తుంటాడు.

న‌న్ను కూడా డైరెక్ట్ చేయాల‌ని చూశాడు. న‌న్ను మాయ చేయాల‌ని చూశాడు. దాని గురించి నేను గ‌ట్టిగా అడిగే స‌రికి ఏమీ జ‌ర‌గ‌న‌ట్టు న‌టించాడు.” అని ఆరోపణలు చేసింది. అంతేకాదు అతను ఓ నటిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. ” ఆ డైరక్టర్ త‌న‌కు సంబంధించిన అమ్మాయిలు మాత్రమే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉండాల‌ని కోరుకుంటాడు. అత‌డికి సంబంధించిన ఓ హీరోయిన్ ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాప్‌ల్లో ఉంది. అయినా ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. కార‌ణాలేంటో ఎవ‌రికీ తెలియ‌దు.” అంటూ సంచలన ట్వీట్లు చేసింది. అయితే ఆ ద‌ర్శ‌కుడు ఎవరు?, ఆ హీరోయిన్ ఎవరు ? అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రస్తుతం పూనమ్ ట్వీట్ టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus