తెలుగు భారీ సీరియల్లో భాగమైన పూనమ్ కౌర్.!

  • April 7, 2018 / 05:25 AM IST

ఇంగ్లిష్ సీరియల్స్ మాదిరిగా… తెలుగులోనూ భారీ సీరియల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. బాహుబలి వంటి సినిమాని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ ఈ సాహసానికి సిద్ధమైంది. అత్యంత భారీ బడ్జెట్ తో స్వర్ణ ఖడ్గం అనే సీరియల్ ను రూపొందిస్తోంది. బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ ఈ భారీ జానపద సీరియల్ ను నిర్మిస్తున్నారు. వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరియల్ లో బుజ్జిగాడు ఫేం సంజన గల్రాని కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె ఈ సీరియల్ కోసం గుర్రపు స్వారీ, కత్తియుద్థాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

ఆమెపై ఇప్పటికే అనేక సన్నివేశాలు తెరకెక్కించారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీని అందిస్తున్న ఈ సీరియల్లో మరో హీరోయిన్ భాగమైంది. మాయ జాలం, ఒక విచిత్రం, వినాయకుడు, గగనం వంటి చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్ ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. ఓ ప్రాంతానికి రాణిగా కనిపించనుంది. త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోంది. వెండితెరపైన సంచలన సృష్టించిన ఆర్కా మీడియా సంస్థ.. స్వర్ణఖడ్గంతో బుల్లితెరపైనా సంచనం సృష్టించబోతోందని టీవీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus