Posani Krishna Murali: విమర్శలు తట్టుకోలేక నాన్న చనిపోయారు.. పోసాని వ్యాఖ్యలు!

  • February 3, 2023 / 03:50 PM IST

సినీ నటుడు పోసాని కృష్ణమురళి గురించి తెలిసిందే. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లో అవగాహన సంపాదించి తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. తరచూ టీవీ షోలలో పాల్గొనే పోసాని.. తాజాగా యాంకర్ సుమ షోకి గెస్ట్ గా హాజరయ్యారు. కమెడియన్ అలీతో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీ ముచ్చట్లు చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో యాంకర్ సుమ.. పోసాని తండ్రి గురించి ప్రశ్నించింది. దీంతో పోసాని ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి చెడు అలవాటు లేని తన తండ్రికి ఎవరో పేకాట నేర్పించారని.. ఆ పేకాటే తన తండ్రి ప్రాణాలను తీసిందని చెప్పుకొచ్చారు. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోయారని చెప్పారు పోసాని. ఎలాంటి చెడ్డ అలవాటు లేని నాన్న పేకాట ఆడడం చూసి ఊళ్లో వారంతా అడిగేవారని.. ఇలా ఎందుకు చేస్తున్నావని విమర్శించేవారని.. ఆ విమర్శలు తట్టుకోలేక, పురుగుల మంది తాగి నాన్న చనిపోయారని పోసాని చెప్పుకొచ్చారు.

తండ్రిని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు పోసాని. ఆ తరువాత తను వాడే మొబైల్ ఫోన్ గురించి ఓ విషయం చెప్పుకొచ్చారు ఇప్పటివరకు తను స్మార్ట్ ఫోన్ వాడలేదని చెప్పారు. చిన్న ఫోన్ మాత్రమే వాడుతున్నట్లు వెల్లడించారు. అంటే మీ ఫోన్ లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్ స్టా గ్రామ్ ఉండవా..? అని సుమ ప్రశ్నించగా.. అవి ఎందుకు..? అంటూ పోసాని ఎదురు ప్రశ్న వేయడంతో షోలో అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus