ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌లోకి వస్తున్న సిమ్రన్

  • March 15, 2021 / 03:20 PM IST

టాలీవుడ్‌ నుండి వేరే వుడ్‌లకు వెళ్లిపోయిన హీరోయిన్ తిరిగి రావడం పెద్ద కొత్త విషయమేమీ కాదు. కానీ ఓ ఎనిమిదేళ్లు సినిమాలు మానేసిన హీరోయిన్‌ ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కి వస్తుండటం విశేషమే కదా. అలా ఎంట్రీ ఇవ్వబోతోంది మంచు మనోజ్‌ నాయిక. ‘పోటుగాడు’లో అందాల భరిణగా అలరించిన సిమ్రన్‌ కౌర్‌ ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. అది కూడా డార్లింగ్‌ ప్రభాస్‌ సినిమాతో. అవును ‘రాధే శ్యామ్‌’ సినిమాతో సిమ్రన్‌ కౌర్‌ రీ ఎంట్రీ ఇస్తోందట.

మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటించిన ‘పోటుగాడు’లో వైదేహిగా కనిపించి అలరించింది సిమ్రన్‌ కౌర్‌. ఆ సినిమా ఫలితం కారణంగానో, ఇంకెందుకో కానీ… ఆ తర్వాత సిమ్రన్‌ టాలీవుడ్‌కు దూరమైంది. తాజాగా సిమ్రన్‌ తిరిగి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ‘రాధేశ్యామ్‌’తో ఆమె రీఎంట్రీ ఇస్తోంది. ‘‘వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం వెండితెరకు దూరమయ్యాను. అయితే కొన్నినెలల క్రితం ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. అందులో నాకో మంచి పాత్ర ఇస్తామన్నారు.

పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఓకే చెప్పేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి షూట్‌లో కూడా పాల్గొన్నాను. నా రోల్‌ సినిమాలో చాలా కీలకం. గొప్ప టీమ్‌తో కలిసి పని చేసినందుకు ఆనందంగా ఉంది’’ అని సిమ్రన్‌ తెలిపింది. ప్రభాస్‌ – పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’కు రాధాకృష్ణ దర్శకుడు. జులై 30న ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus