“సైరా నరసింహారెడ్డి” కి పవర్ ఫుల్ డైలాగులు రాసే పనిలో రచయితలు!

  • February 2, 2018 / 12:37 PM IST

ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా “సైరా నరసింహారెడ్డి”. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. డైరక్టర్ సురేందర్ రెడ్డి  చిరుపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు కంప్లీట్ చేశారు. రెండో షెడ్యూల్  ఈ నెల 20 నుంచి మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో కీలకమైన టాకీ పార్ట్ చిత్రీకరించనున్నారు. అంతలోపున స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం. కారణం ఏమిటంటే నరసింహారెడ్డి చెప్పే డైలాగులు మరింత పవర్ ఫుల్ గా ఉండాలని మెగాస్టార్ అభిప్రాయం.

ఇదివరకు రాసిన డైలాగులు అంతగా నచ్చకపోవడంతో.. కొత్తగా డైలాగులు రాయమని సూచించారంట. అందుకు అనుగుణంగానే డైరక్టర్ మార్పులు చేస్తున్నారు. కొత్త డైలాగుల కోసం “గౌతమి పుత్ర శాతకర్ణి” సినిమాకు డైలాగులు రాసిన సాయి మాధవ్‌ను ఆయన సంప్రదించినట్లు తెలిసింది. ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్‌ పర్యవేక్షణలో సాయి మాధవ్‌ కొత్త డైలాగులు రాస్తున్నారు. బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని  కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus