‘ప్రభాస్ 20’ కోసం అది తప్పడం లేదంట…!

  • April 1, 2020 / 07:24 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ప్రస్తుతం తన 20 వ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఓ డియర్’ ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయ్యింది.

ముందుగా ఈ చిత్రం షూటింగ్ ను ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరించాలని అనుకున్నారు.కానీ విదేశాల్లో పరిస్ధితి ఏమాత్రం బాలేదు. దీంతో విదేశాల్లో తియ్యాలి అనుకున్న బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ను ఇక్కడే చిత్రీకరించాలి అని డిసైడ్ అయ్యారట. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ హాస్పిటల్ సెట్ ను వేసి అందులో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాలి అని డిసైడ్ అయ్యారట.

ముందుగానే ఓ రెండు సెట్లను అక్కడ వేశారు. ఇప్పుడు హాస్పిటల్ సెట్ ను కూడా వేస్తున్నారట. త్వరలోనే ఈ షెడ్యూల్ మొదలు కాబోతోందని సమాచారం. ప్రభాస్ హాస్పిటల్ లో ఉండే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని కూడా తెలుస్తుంది. అతి త్వరలో ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేస్తారని కూడా సమాచారం.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus