ఫ్యాన్స్ కు కొత్త బాధ్యతను అప్పగించిన ప్రభాస్..!

  • June 11, 2020 / 10:57 PM IST

ఇటీవల రాజ్యసభ సభ్యుడైన జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది 3వ దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్సెప్ట్ చేసాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ దశను ప్రభాస్ ప్రారంభించి వార్తల్లో నిలిచాడు. తన ఇంట్లో ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి ప్రభాస్ మూడు మొక్కలు నాటి మూడో దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేసాడు.

ఇందులో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ.. “రాజ్యసభ సభ్యులైన సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ఎంతో గొప్ప విలువలతో కూడుకున్నది. ఇందులో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ నన్ను ఇన్ స్పైర్ చేసింది. ఆయన ఇన్స్పిరేషన్ తో.. ఆయన ఎక్కడ చెబితే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, దాని డెవలప్ మెంట్ కోసం కృషి చెయ్యాలని డిసైడ్ అయ్యాను.

సంతోష్ కుమార్ గారి మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే..అంతా కలిసి పనిచెయ్యాలి. అప్పుడే సమాజం బాగుంటుందనుకుంటున్నాను . ఈ ఛాలెంజ్ లో భాగంగా నా ఫ్యాన్సంతా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఛాలెంజ్ ను .. రాంచరణ్, రానా, శ్రద్ధా కపూర్ లకు కూడా విసిరాడు ప్రభాస్.

1

2

3

4

5

6

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus