ప్రభాస్ ‘ఆది పురుష్’ ఆ రేంజ్లో ఉండబోతుందా…?

  • August 20, 2020 / 03:12 PM IST

ఓ పక్క ‘రాథే శ్యామ్’ అనే చిత్రం చేస్తూనే మరో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు ప్రభాస్. ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తన 21వ చిత్రాన్ని చెయ్యబోతున్నట్టు ప్రభాస్ రెడీ అయిన సంగతి తెలిసిందే. తరువాత తన 22వ సినిమాకి సంబంధించిన అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేసాడు. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న మైతిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రూపొందబోతున్న ఈ చిత్రానికి “ఆది పురుష్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ వంటి నిర్మాతలు భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు,హిందీతో పాటు.. కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో కూడా రూపొందనుంది.’తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. అంతేకాదు ఈయన కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ … రాముడి పాత్ర చెయ్యబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో సీత, లక్ష్మణుడు, రావణుడు వంటి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆశక్తి కూడా నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని 3D లో రూపొందించనున్నారు.

500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. ఈ చిత్రం వి.ఎఫ్.ఎక్స్ కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ను ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఒక సంవత్సరంలోనే పూర్తి చంయబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కానీ అదంత ఈజీ కాదనేది చాలా మంది వాదన. ఏమైనా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ‘బాహుబలి’ ని మించే ఏర్పడుతున్నాయి అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus