ప్రభాస్ సినిమా మరింత ఆలస్యం కానుందా..?

  • November 26, 2020 / 05:42 PM IST

‘బాహుబలి’ సినిమా నుండి ప్రభాస్ నటించే సినిమాలు ఎప్పుడో కానీ ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఏళ్ల తరబడి గ్యాప్ వస్తోంది. ఈ విషయం ప్రభాస్ అభిమానుల్లో ఒకింత అసంతృప్తి కలిగిస్తోంది. కానీ ప్రభాస్ మాత్రం ప్రతీ సినిమా పూర్తి చేయడానికి రెండేళ్లు కేటాయిస్తూ వెళ్తున్నాడు. ఆయన చేసేవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి ఆ మాత్రం సమయం తీసుకోక తప్పడం లేదు. ‘రాధేశ్యామ్’ కూడా చాలా కాలంగా మేకింగ్ లోనే ఉంది. ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో కూడా అదే జరగబోతుంది. ఆ తరువాత చేయబోయే నాగ్ అశ్విన్ సినిమాలో కూడా ఇదే రిపీట్ కాబోతుంది.

ఈ సినిమాకి ప్రభాస్ రెండున్నరేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుందట. ఇప్పుడు ఈ విషయంలో ప్రభాస్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. నిజానికి ‘రాధేశ్యామ్’ తరువాత నాగ్ అశ్విన్ సినిమానే మొదలుకావాలి. కానీ ఇప్పుడు అశ్విన్ సినిమా పక్కన పెట్టి ‘ఆదిపురుష్’కి ఓకే చెప్పాడు. ‘ఆదిపురుష్’ సినిమా తరువాత నాగ్ అశ్విన్ తో సినిమాను చేయాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను మరింత వెనక్కి నెట్టబోతున్నట్లు సమాచారం. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ సినిమా దాదాపు ఖాయమైనట్లేనని చెబుతున్నారు. అంతేకాదు.. నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడట ప్రభాస్. అశ్విన్ సినిమా కోసం బల్క్ కాల్షీట్స్ కేటాయించాల్సివుంది. ఆ సినిమా చేస్తున్న సమయంలో మరో సినిమా చేయడానికి లేదు. అందుకే మిగిలిన సినిమాలన్నీ పూర్తి చేసుకొని ఆ తరువాత అశ్విన్ సినిమా మొదలుపెట్టాలని ప్రభాస్ తాజాగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే 2021 లో కూడా అశ్విన్ సినిమా మొదలుకాదు. 2022 వరకు ఎదురుచూడాల్సి వస్తుంది!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus