కరణ్ జోహార్ తో ప్రభాస్‌ భారీ డీల్ !

  • June 21, 2017 / 07:34 AM IST

హీరోలు అంటే క్రేజ్…ఒక్క చాన్స్ వస్తే చాలు హీరో అయిపోతాను అని అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే అదే క్రమంలో ఆ ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్ వాళ్ళు సైతం చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాహుబలి ముందు ఒక లెక్క, ఆ తరువాత ఒక లెక్క అంటే అతిశయోక్తి కాదు… ఎందుకంటే ‘బాహుబలి’ ప్రాజెక్ట్ తరువాత ఇండియన్ సినిమా సెలిబ్రిటీగా మారిపోయాడు మన మిర్చి ప్రభాస్. అయితే అంతటి క్రేజ్ వచ్చిన తరువాత ఆఫర్స్ వదులుతాయా….లేదుగా కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఎందరో ప్రముఖ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికాలో రోజులు గడుపుతూ తప్పించుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పడు అసలు విషయం లోకి వెళితే…ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రభాస్‌ తో 150 కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చు కున్నట్లుగా బాలీవుడ్ మీడియా టాక్ బలంగా వినిపిస్తుంది… అంతేకాదు రెండు రోజుల క్రితం ప్రభాస్‌ తో ఈ డీల్ ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

లెక్కల్లోకి వెళితే…ఈ డీల్ ప్రకారం కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నుండి ప్రభాస్ 150 కోట్ల భారీ అమౌంట్ అందుకోబోతున్నాడని టాక్. ప్రభాస్ కెరీర్లోనే ఇది అతిపెద్ద డీల్ అని అంటున్నారు. అయితే ఈ 150 కోట్ల డీల్ ద్వారా ధర్మ ప్రొడక్షన్స్ తరుపున ప్రభాస్ మూడు సినిమాలు చేసే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ప్రస్తుతం ఈ డీల్ ని మనం గాసిప్ లా తీసుకున్నా…త్వరలోనే ఈ డీల్ గురించి పూర్తి అధికారిక వివారాలు ప్రకటిస్తారు అని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే వచ్చే ఏడాది నుంచి ప్రభాస్ బాలీవుడ్ హీరోగా మారిపోతాడు అన్న మాట నిజం కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus