ప్రభాస్ నెక్స్ట్ సినిమా కెమెరామెన్ పేరు వెల్లడించిన సుజీత్

  • January 7, 2017 / 10:48 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిన్ననే బాహుబలి ప్రాజెక్ట్ కి గుమ్మడికాయ కొట్టి బయటికి వచ్చారు. అతని విడుదలకు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న డైరక్టర్ సుజీత్ కి ఉత్సాహం వచ్చింది. ఇతని దర్శకత్వంలోనే డార్లింగ్ నెక్స్ట్ మూవీ చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో నిర్మితం కానున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ? అని అందరూ ఎదురుచూస్తున్నారు. సుజీత్ అయితే రన్ రాజా రన్ చిత్రం తర్వాత ఏ ప్రాజక్ట్ ఒప్పుకోకుండా ప్రభాస్ కోసమే  నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం అన్ని దారులు క్లియర్ అయ్యాయి. డైరక్టర్, నిర్మాత తరవాత ఈ చిత్రానికి పనిచేయనున్న కెమెరా మెన్ విషయంలో అధికారిక ప్రకటన వచ్చింది. మధి పేరును ఈరోజు డైరక్టర్ సుజీత్ వెల్లడించారు.

అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్ 19 వ చిత్రానికి మధి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. కోలీవుడ్ లో మంచి పేరున్న తమిళ సినిమాటోగ్రాఫర్  మధి “మిర్చి” సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రన్ రాజా రన్ కి పనిచేశారు. సూపర్ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీకి కూడా ఇతనే కెమెరా మెన్. మూడు హిట్లు అందుకున్న ఈ టెక్నీషన్   ప్రభాస్ మూవీకి మరోసారి పనిచేయబోతున్నారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus