Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

మలయాళంలో ‘కిష్కింధ కాండం’, ‘ఎకో’ (EKO) లాంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ సినిమాలతో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు డైరెక్టర్ దింజిత్ అయ్యత్తన్..! తాజాగా అతను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను(Prabhas) కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లిద్దరి మీటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Prabhas

ప్రభాస్‌ను కలిసిన ఆనందాన్ని దింజిత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “ఇండియన్ సూపర్‌స్టార్ ప్రభాస్ గారితో అద్భుతమైన సమయం గడిపాను. సరదా కబుర్లతో ఆ సాయంత్రం హాయిగా గడిచిపోయింది.

ముఖ్యంగా ఆయన వడ్డించిన ప్రాన్స్ (రొయ్యల) బిర్యానీ టేస్ట్ అయితే అదుర్స్. నాకు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్ సార్‌కి.. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన విజయ్ సార్‌కి, అలాగే హోంబలే ఫిల్మ్స్‌కి స్పెషల్ థ్యాంక్స్” అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.దింజిత్ పెట్టిన ఈ పోస్ట్‌తో ప్రభాస్ కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌కు ఆయన ఓ పవర్ ఫుల్ స్టోరీ వినిపించారని, ఆ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ డార్లింగ్‌కు బాగా నచ్చేసిందని ఇన్‌సైడ్ టాక్.

‘సలార్’ నిర్మాతలు ‘హోంబలే ఫిల్మ్స్’ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం కోలీవుడ్ స్టార్ ధనుష్‌ను కూడా దింజిత్ కలిశారు. ఆ టైమ్లో ‘ఎకో’ సినిమా ఓ మాస్టర్ పీస్ అని ధనుష్ ప్రశంసించారట. అందులో మ్లాతి చేడతి పాత్రలో నటించిన బియానా మోమిన్ పెర్ఫార్మెన్స్ వరల్డ్ క్లాస్ లెవెల్‌లో ఉందని, ఆమెను ఎలా సెలెక్ట్ చేశారని ధనుష్ ఆరా తీశారు.

అలాగే ‘కిష్కింధా కాండం’లో విజయరాఘవన్ యాక్టింగ్ అద్భుతమని కొనియాడుతూ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.ఇలా బ్యాక్ టు బ్యాక్ సౌత్ బడా స్టార్స్‌ను ఈ మలయాళ డైరెక్టర్ కలుస్తుండటంతో.. త్వరలోనే ఆయన నుంచి భారీ అనౌన్స్‌మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus