కరణ్ జోహార్ తక్త్ సినిమా ఆఫర్ ని తిరస్కరించిన ప్రభాస్

  • August 23, 2018 / 09:22 AM IST

బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ 500 కోట్లతో తక్త్ సినిమాను తెరకెక్కించనున్నారు. రన్ వీర్ సింగ్, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, అనిల్ కపూర్, జాన్వీ కపూర్, భూమి పెడ్నేకర్ తదితరులు నటించనున్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. మొఘల్ చక్రవర్తుల కాలానికి చెందిన కథతో రూపుదిద్దుకోనున్న ఈ మూవీ 2020 లో రిలీజ్ కానుంది. ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాలో ప్రభాస్ కి ఆఫర్ వచ్చిందంట. సెకండ్ లీడ్ హీరోగా నటించమని ప్రభాస్ ను కరణ్ జోహార్ కోరారని తెలిసింది. భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తానని మాట ఇచ్చినట్టు సమాచారం.

అయితే ప్రభాస్ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు ఫిలింనగర్ వాసులు చెప్పారు. ప్రభాస్ తిరస్కరించిన పాత్రను ‘సంజు’ సినిమాలో రణబీర్ కపూర్ ఫ్రెండ్ పాత్రలో నటించిన విక్కీ కౌశల్ చేయబోతున్నారు. అతనికి ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుందని, ప్రభాస్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు మాత్రం.. తమ హీరో ఆఫర్ ని వద్దనున్నారంటే ఆ పాత్ర బాగాలేదన్నమాట. అందుకే వదులుకున్నారు. లేదంటే ఎంతకష్టమైనా చేసేవారు అని సమర్థిస్తున్నారు. మరి ఇందులో ఎవరి మాట నిజమవుతుందో తెలియాలంటే రెండేళ్లు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus