ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న ‘సాహో’ స్టోరీ లైన్?

  • June 6, 2019 / 06:09 PM IST

‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15 న విడుదల కాబోతుంది. బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే విడుదల చేసిన మేకింగ్ వీడియోలు చిత్రం పై అంచనాల్ని పెంచేసాయి. ఇక ఈ చిత్రం కథ ఇదేనంటూ ప్రస్తుతం ఓ వార్త బయటకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఓ అండర్ వరల్డ్ డాన్ ని అంతం చేయడానికి ప్రభాస్ నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా మారతాడట. ఈ రకంగా అండర్ వరల్డ్ డాన్ అనుచరులందరిని మట్టుబెడుతుంటాడట. ఫ్లాష్ బ్యాక్ లో ఆ డాన్ ప్రభాస్ కుటుంబ సభ్యులని, స్నేహితులని హత్య చేసి ఉంటాడు. అతడి పై ప్రతీకారం తీర్చుకుందుకే ప్రభాస్ ఇలా నకిలీ అధికారిగా మారతాడని తెలుస్తుంది. ఈ ఆసక్తికరమైన కథాంశంతోనే ‘సాహో’ చిత్రం సాగుతుందట. వినడానికి కాస్త ‘రెబల్’ చిత్రం లానే ఉంది కదూ..! 2012 లో వచ్చిన ‘రెబల్’ చిత్రం ప్లాప్ గా మిగిలింది. మరి ‘సాహో’ చిత్ర ఫలితం ఏమవుతుందో అని ప్రభాస్ అభిమానులు భయపడుతున్నారు. అయితే ‘సాహో’ చిత్రానికి సుజిత్ డైరెక్షన్ మెస్మరైజ్ చేస్తుందట. మరి ఈ కథనంలో ఎంతవరకూ నిజమెంతుందో తెలియాలంటే ఆగష్టు 15 వరకూ వేచి చూడాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus