బంపర్ ఆఫర్ పట్టేసిన పూజా హెగ్డే

  • April 27, 2018 / 06:16 AM IST

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతోంది. అత్యంత సాహసమైన కారు ఛేజింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్, నీల్ నితిన్ ముకేష్, తదితరులపై చిత్రీకరించే ఈ కార్ల ఛేజింగ్ సీన్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో ప్రాజక్ట్ ని ప్రభాస్ లైన్ లో పెట్టారు. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమా జులై లో సెట్స్ పైకి వెళ్లనుంది. అంతలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా కంప్లీట్ చేయాలనీ డైరక్టర్ ఫిక్స్ అయ్యారు. టెక్నీషియన్లు, ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నారు.

ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. ఈయన గతంలో ‘దేవ్ డి, ఇష్క్ జ్యాదా, క్వీన్, హైవే, లూటేరా’ వంటి సినిమాలకు సంగీతం ఇచ్చారు. ప్రభాస్ 20 వ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. అలాగే తాజాగా హీరోయిన్ ఫిక్స్ అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. డీజే సినిమా ద్వారా పరిశ్రమ దృష్టిలో పడ్డ పూజా హెగ్డేని ప్రభాస్ కి జోడీగా తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సాక్ష్యం మూవీ చేస్తున్న పూజా.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా బంపర్ ఆఫర్ అందుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus